ఐపీఎల్2020 నుంచి రైనా తప్పుకోవడానికి కారణమిదే !

ఐపీఎల్-2020 నుంచి సురేష్ రైనా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడేందుకు యూఏఈ వెళ్లిన రైనా.. భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. రైనా ఈ సీజన్‌ ఐపీఎల్‌ ఆడడం లేదని ఆ జట్టు సీఈవో విశ్వనాథన్‌ ట్వీట్‌ చేశారు. వ్యక్తిగత కారణాల వలన రైనా ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వినిపించాయి. తాజాగా దానికి గల కారణాలు వెలుగులోనికి వచ్చాయి.

దోపిడీ దొంగల ముఠా చేసిన దాడిలో క్రికెటర్‌ రైనా బంధువు ఒకరు మృతిచెందారు. మరో నలుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువు మృతి వార్త తెలుసుకుని యూఏఈ వెళ్లిన రైనా.. భారత్‌కు తిరుగు ప్రయాణమైనట్లు తెలుస్తోంది.