వాట్సాప్ ని టార్గెట్ చేసిన కాంగ్రెస్

ఫేస్‌బుక్‌ ఆధీనంలో ఉన్న మరో సోషల్‌ మీడియా యాప్‌ వాట్సాప్‌ కూడా.. భాజపా కనుసన్నల్లోనే నడుస్తోందని కాంగ్రెస్ ఆరోపస్తోంది. భారత్‌లో వాట్సాప్ భాజపా అనుకూల విధానం అనుసరించటం పట్ల విచారణ జరిపించాల్సిందిగా కోరుతూ గతంలో కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ జుకర్‌బర్గ్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి జుకర్ బర్గ్ కి లేఖ రాశారు.

భారతదేశంలో పరిస్థితిని సమీక్షించేందుకు ఏం చేస్తున్నారో చెప్పాలంటూ ఆయన సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ను ప్రశ్నించారు. అంతేకాకుండా ఫేస్‌బుక్‌ ఆధీనంలో ఉన్న మరో సోషల్‌ మీడియా యాప్‌ వాట్సాప్‌ కూడా.. భాజపా కనుసన్నల్లోనే నడుస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.