కరోనా బారినపడిన జెనీలియా

సీనియర్ హీరోయిన్ జెనీలియా కరోనా బారినపడ్డారు. తాజాగా ఆమె ఈ విషయాన్ని తెలిపింది. మూడు వారాల కిందటే తాను కరోనా బారినపడ్డా. ఇప్పుడు కోలుకున్నానని తెలిపింది. నాకు ఎలాంటి లక్షణాలూ లేవు. దేవుడి దయవల్ల ఈ రోజు చేసిన పరీక్షల్లో నాకు నెగటివ్‌ వచ్చింది. నేను సులభంగానే కరోనాను జయించాను. కానీ  ఈ 21 రోజులు ఐసోలేషన్‌లో ఉండటం నాకు సవాల్‌గా అనిపించిందని తెలిపింది.

‘బాయ్స్‌’ చిత్రంతో జెనీలియా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘సాంబ’, ‘సై’, ‘ఢీ’, ‘బొమ్మరిల్లు’, ‘సత్యం’, రెడీ తదితర చిత్రాల్లో నటించారు. బొమ్మరిల్లులో ఆమె చేసిన హాసిని పాత్ర మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఇప్పుటికీ తెలుగు ప్రేక్షకులు జెనీలియాని హాసినిగానే పిలుచుకుంటుంటారు.