ఏపీలో టెంపుల్ నిర్మాణానికి కేసీఆర్ విరాళం

ఏపీలో ఆలయ నిర్మాణానికి తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు విరాళం అందించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం స్వర్ణముఖి దివ్యక్షేత్రంలో వేంకటేశ్వరస్వామి ఆలయం ముందు భాగంలో మహారాజ గోపురం, తూర్పు మాడవీధి నిర్మాణానికి విరాళమిచ్చారు.

శనివారం ఆలయంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం, ఇతర పూజా కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ దంపతులు పాల్గొనాల్సి ఉంది. అయితే కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా హాజరు కాలేదు. అయితే ఆలయ నిర్వాహకులు సీఎం కేసీఆర్ దంపతుల పేరిట శిలాఫలకం ఆవిష్కరించారు.