కరోనాపై రామ జోగయ్య శాస్త్రి పాట.. విన్నారా ?


మహమ్మారి కరోనాపై ప్రముఖ సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి ఓ పాట రాసి విడుదల చేశారు. ‘హే సీశైలం మల్లయ్యా మా భూగోళం మంచిగ లేదయ్యా.. నీ ఆవేశాలు చాలు చాలు అట్టా శివాలెత్తమాకయ్యా శివయ్యా’ అంటూ ఈ పాట కొనసాగుతోంది.

‘ఆ మూడో కన్ను అట్నే మూసి ఉంచయ్యా’, ‘నీవే వీరభద్రుడివైతే అంతే సంగతి’ అంటూ సాగుతున్న ఈ పాట ఆసక్తికరంగా ఉంది. ‘చల్లబడరా మా అయ్య’ అంటూ ఈ పాట ముగుస్తుంది. ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి తన యూట్యూబ్‌ చానెల్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ పాట వైరల్ అవుతోంది. మీరు ఓ సారి వినేయండీ!