ప్రణబ్‌ ముఖర్జీకి టీమ్‌ఇండియా సంతాపం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి పలువురు క్రికెటర్లు నివాళులర్పించారు. సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలిపారు. ‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ లేరని తెలిసి చాలా బాధేసింది. పలు దశాబ్దాల పాటు ఆయన దేశానికి ఉత్తమ సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’నని సచిన్ ట్విట్ చేశారు.

‘దేశం ఓ గొప్ప లీడర్‌ను కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’ అంటూ టీమిండియ కెప్టెన్ విరాట్‌కోహ్లీ ట్విట్ చేశారు. ‘దేశానికే ఆదర్శవంతమైన నేత. ఆయన ఆత్మీయులకు నా సానుభూతి తెలియజేస్తున్నా’నని రోహిత్‌శర్మ ట్విట్ చేశారు. వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌.. తదితర క్రీడా ప్రముఖులు ప్రణబ్ దా కు నివాళులు అర్పించారు.