మా కుటుంబానికి జరిగింది దారుణం : సురేష్ రైనా

సురేష్ రైనా సడెన్ గా ఐపీఎల్ 2020 నుంచి తప్పుకొని స్వదేశానికి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వలనే రైనా ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. ఆయన బంధువు ఇంటిపై దొంగలు దాడి చేశారనే వార్తలు వినిపించాయి. తాజాగా దీనిపై రైనా స్పందించారు.

‘పంజాబ్‌లో మా కుటుంబానికి జరిగింది దారుణం కన్నా ఘోరం. మా మామయ్య హత్యకు గురయ్యారు. మా మేనత్త, వాళ్ల ఇద్దరు కుమారులు తీవ్ర గాయాలపాలయ్యారు. దురదృష్టం కొద్దీ గత రాత్రి మరొకరు కన్నుమూశారు. ఇప్పటికీ మా అత్తయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు’

‘ఆరోజు రాత్రి ఏం జరిగిందనే విషయంపై మాకెవరికీ సమాచారం లేదు. ఎవరు చేశారో తెలియదు. ఈ విషయంపై పంజాబ్‌ పోలీసులు త్వరగా దర్యాప్తు చేయాలని కోరుతున్నా. వాళ్లని ఇంతలా క్రూరంగా హింసించిన వాళ్లెవరో మాకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ నేరస్థులు మరిన్ని ఘోరాలు చేయడానికి అవకాశం ఇవ్వొద్దు’ అంటూ వరుస ట్విట్లు చేశారు రైనా.