ఆఖరి టెస్టులో తొలి దెబ్బ పడింది

జోహాన్నెస్ బర్గ్ వాండరర్స్ వేదికగా మొదలయిన ఆఖరి టెస్ట్’లో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీ సేన ఇప్పటి వరకు గర్జించలేదు. ఇప్పటికే రెండు టెస్టుల్లోనూ ఓటమిపాలై సిరీస్ ని కోల్పోయింది. జోహాన్నెస్ బర్గ్ వాండరర్స్ వేదికగా జరగనున్న ఆఖరి టెస్టులో గెలిచి పరువు నిలుపుకోవాలని రంగంలోకి దిగింది. ఈ టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది.

భారత్ ఇన్నింగ్స్ ను మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ప్రారంభించారు. ఐతే, భారత్ 7 పరుగుల వద్ద రాహుల్ వికెట్ ను కోల్పోయింది. ఫిలాండర్ బౌలింగ్ లో రాహుల్ కీపర్ డికాక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వన్ డౌన్ లో పుజారా క్రీజ్ లోకెి వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 7/1. ఇక, కెప్టెన్ కోహ్లీ ఆఖరి టెస్టు కోసం రోహిత్ స్థానంలో అజింక్యా రహానే, అశ్విన్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ జట్టులోకి తీసుకొన్నాడు