వైఎస్ఆర్’కు ఘన నివాళి


దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్ ఆర్ కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి ఇతర కుటుంబసభ్యులతో పాటు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, రవీంద్రనాథ్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తండ్రి సమాధి వద్ద సీఎం జగన్ కాసేపు ప్రార్థనలు చేశారు. మరోవైపు వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ ఆర్ కు నివాళులు అర్పించారు. వైఎస్ ఆర్ విగ్రహాలకి పూలమాలలు వేస్తున్నారు. వైఎస్ ఆర్ వర్థంతి సందర్భంగా పలువురు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు.