139 మంది రేప్ కేసు : ఫైనల్ గా నిందితుడు ఎవరంటే?

హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఓ సంచలన కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనని 139 మంది రేప్ చేశారని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ లిస్టులో సినీ, రాజకీయ, మీడియా ప్రముఖులు ఉన్నట్టు ప్రచారం జరిగింది. దీంతో ఈ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చేలా ఉన్నాయని అనుకున్నారు. అయితే బాధితురాలు అందరికి షాకిస్తూ.. తన 139 మంది వాడుకోలేదని రాజశేఖర్‌రెడ్డి, అలియాస్ డాలర్ ‌భాయ్ ఒత్తిడి కారణంగా అంత మందిపై ఫిర్యాదు చేసినట్టు తెలిపింది.

ఫైనల్ ఈ ఈ కేసులో నిందితుడు ఎవరు అంటే.. డాలర్ భాయ్ అని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. బాధితురాలు ప్రతిసారి పొత్తన లేని మాటలు మాట్లాడటం పోలీసులకి పెద్ద తలనొప్పింగా మారింది. ఈ నేపథ్యంలోనే బాధితురాలి నుంచి మరోమారు వాంగ్మూలం తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. నిందితుల జాబితాలోనూ మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, భవిష్యత్తుల్లో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి న్యాయస్థానంలోనూ 164 స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు రెడీ అవుతున్నారు.
మరోవైపు డాలర్ భాయ్ బాధితురాలిపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. గతంతో ఆమె వ్యభిచారం కూడా చేసిందని ఆరోపించారు. పరారీలో ఉన్న డాలర్ భాయ్ ఓ వాయిస్ మెసేజ్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. డాలర్ భాయ్, బాధితురాలు తలతోక లేని ఆరోపణలతో పోలీసుల విలువైన సమయాన్ని వేస్ట్ చేసినట్టు అనిపిస్తోందని అంటున్నారు.