TS కరోనా రిపోర్ట్ : 2,478 కేసులు, 10 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,478 కొత్త‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,35,884కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 886కి చేరింది.

ఒక్క  జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 267 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తాజాగా 2,011 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 1,02,024 మంది కరోనాను జయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32,994 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరో 25,730 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.