ఒక్కరోజే 1096 కరోనా మరణాలు

దేశంలో కరోనా విజృంభిస్తోంది.  ప్రతిరోజూ పాజిటివ్‌ కేసులు కూడా భారీగానే నమోదవుతున్నాయి. వరుసగా రెండోరోజూ అత్యధికంగా 83వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 39లక్షల 36వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 30లక్షల మంది కోలుకోగా మరో 8లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి.

గడిచిన 24గంటల్లో అత్యధికంగా 1096 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ఒకేరోజు వ్యవధిలో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 68,472కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 66వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతం దాటింది. మరణాల రేటు 1.7శాతంగా ఉంది.