కంగనా పొలిటికల్ సవాల్

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఆరోపణలు ఇన్నాళ్లు సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం అయ్యేవి. ఇప్పుడు ఆమె రాజకీయ నాయకులని కూడా టార్గెట్ చేస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో సంచలన ఆరోపణలు చేస్తున్న కంగనాని ముంబై రావొదని శివసేన కీలక నేత సంజయ్ రౌత్ బెదిరించారని ట్విట్ చేసింది. దీనిపై సంజయ్ రౌత్ స్పందించారు. ‘ముంబై ఎవరి సొత్తు కాదు. అక్కడ ఏం జరుగుతుంది’ అని ప్రశ్నించాడు. అయితే కంగనా తాజా ట్విట్ లో ఆయన్ని సవాల్ చేసింది.

‘ముంబైకి తిరిగి రాకూడదని చాలా మంది నన్ను బెదిరిస్తున్నారు, కాబట్టి నేను వచ్చే వారం సెప్టెంబర్ 9 న ముంబైకి వెళ్లాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. నేను ముంబై విమానాశ్రయంలో దిగే సమయాన్ని పోస్ట్ చేస్తాను, ఎవరికైనా దమ్ముంటే ఆపుకోండి’ సవాల్ చేసింది. ఇక బాలీవుడ్ లో బంధుప్రీతినే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. బాలీవుడ్ లో 90శాతం మంది డ్రగ్స్ వాడుతున్నారని కంగనా ఆరోపించిన సంగతి తెలిసిందే.