బిగ్ బ్రేకింగ్ : రియా సోదరుడి అరెస్ట్‌


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో డ్రగ్స్ కోణం బయటపడిన సంగతి తెలిసిందే. రంగంలోకి దిగిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా సుశాంత్‌ స్నేహితురాలు రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, సుశాంత్‌ హౌస్‌ మేనేజర్‌గా పనిచేసిన శామ్యూల్‌ మిరండాను ఎన్‌సీబీ అధికారులు శుక్రవారం రాత్రి వారిని అరెస్ట్‌ చేశారు.

తొలుత వీరి నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు అనంతరం సుదీర్ఘంగా విచారించారు. జుహూలోని రియా నివాసంలోకి వచ్చిన ఎనిమిది మంది అధికారుల బృందం సోదాలు జరిపింది. ఆ సమయంలో రియాతో పాటు షోవిక్‌, వారి తల్లిదండ్రులు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇటీవల రియా చక్రవర్తిని విచారించిన సందర్భంలో ఆమె ఫోన్‌ సీజ్‌ చేసిన ఈడీ అధికారులు.. రియా వాట్సాప్‌ మెసేజ్‌లను పరిశీలించారు. డ్రగ్స్‌ అంశంపై సుశాంత్‌ మాజీ మేనేజర్‌ శృతి మోదీతో పాటు మరికొందరితో వాట్సాప్‌ చాటింగ్‌ జరిగినట్టు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ ఆగస్టు 26న కేసు నమోదు చేసింది. తాజాగా డ్రగ్స్ కేసులో సుశాంత్ సోదరుడి అరెస్ట్ చేశారు. 

రియా సోదరుడు అరెస్ట్ పై సుశాంత్ సోదరి స్వేతా సింగ్ హర్షం వ్యక్తం చేశారు. నెటిజన్స్ కూడా ఇది గుడ్ న్యూస్ అంటూ ట్విట్స్ చేస్తుండటం విశేషం.