TSలో 2,574 కేసులు, 9 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,574 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,40,969కి చేరింది. మృతుల సంఖ్య 886కి చేరింది.

నిన్న ఒక్క రోజే కరోనా బారి నుంచి కోలుకుని 2,927 మంది డిశ్ఛార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 1,07,530కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 32,553 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న అత్యధికంగా 325 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ ప్రతిరోజూ కొలిచినట్టు కొత్త కేసులు, మరణాలు నమోదవుతుండటం విశేషం. ప్రతిరోజూ 2వేల నుంచి 2,500కొత్త కేసులు నమోదవుతున్నాయి. 10లోపు మరణాలు సంభవిస్తున్నాయి. అయితే తెలంగాణలో కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందనే విమర్శలున్నాయి. దీనిపై హైకోర్టు పలుమార్లు అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.