అమానుషం :  కరోనా వచ్చిందని కన్నతల్లిని పొలంలో వదిలేసిన కొడుకులు

కరోనా విజృంభిస్తున్నటైమ్ లో మానవత్వం మంటగలిపే కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అత్తకు కరోనా అని కోడులు ఇంట్లోకి రానివ్వకపోవడం, కోడలు కరోనా అని అత్త ఇంట్లోకి రానివ్వని ఘటనలు ఇప్పటికే చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇక తల్లికి కరోనా సోకడంతో నడిరోడ్డుపై వదిలేసిన ఘటనలు చూశాం. తాజాగా ఇలాంటి అమానుష ఘటన ఒకటి వరంగల్ అర్భన్ జిల్లా పీచర గ్రామంలో చోటుచేసుకొంది.

లచ్చమ్మ(82)కు నలుగురు కొడుకులు. ఓ కూతురు. లచ్చమ్మకు కరోనా సోకడంతో.. కొడుకులు పొలం దగ్గర వదిలేసి వచ్చారు. అక్కడ ఒక్కటే బిక్కు బిక్కుమంటూ ఉంటోంది. ఈ ఘటనకు టీవీ ఛానెల్స్ ప్రచారం చేశాయి. దీంతో ఈ అమానుష ఘటన వైరల్ అవుతోంది. కరోనా టైమ్ లో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. కానీ వెలుగులోకి వస్తున్నాయి కొన్నే అని చెబుతునారు.