ఏపీ అన్‌లాక్‌-4 గైడ్ లైన్స్.. విద్యా సంస్థలకు అనుమతి !

ఏపీ ప్రభుత్వం అన్‌లాక్‌-4 గైడ్ లైన్స్ విడుదల చేసింది.కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏపీ అన్‌లాక్‌-4 గైడ్  లైన్స్ ని రూపొందించింది. ఈ నెల 21 నుంచి 9, 10, ఇంటర్‌ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం తల్లిదండ్రుల రాతపూర్వక అంగీకారం తప్పనిసరి చేసింది.

ఈ నెల 21 నుంచే పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్లవచ్చని తెలిపింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు తెరచుకునేందుకు అనుమతినిచ్చింది. 100 మందికి మించకుండా సామాజిక, విద్య, క్రీడలు, మతపరమైన, రాజకీయ సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించింది. ఈ నెల 20 నుంచి పెళ్లిళ్లకు 50 మందిని, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి ఇచ్చింది.