బిగ్ బాస్ 4 : మొదటి రోజే ఏడుపులు

బుల్లితెరపై బిగ్ బాస్ హంగామా మరోసారి మొదలైపోయింది. ఆదివారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మొదలైన సంగతి తెలిసిందే. హోస్ట్ నాగార్జున 16  మంది కంటెస్టెంట్స్ ని ప్రేక్షకులకి పరిచయం చేసి బిగ్ బాస్ ఇంట్లోకి పంపించారు. ఈ సందర్భంగా చేసిన డ్యాన్సులు, ప్రదర్శించిన ప్రోమోలు ఆకట్టుకున్నాయి.

ఇక సోమవారం ప్రసారమైన బిగ్ బాస్ 4 డే-1లోనే ఇంట్లో ఏడుపులు మొదలయ్యాయ్. సభ్యులు తమని తమని పరిచయం చేసుకొనేందుకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. ఓ స్లిప్ ఇచ్చి.. దాంట్లో వచ్చిన లైన్ గురించి చెప్పమని చెప్పారు. ఈ క్రమంలో ఇంటి సభ్యులు ఫ్యామిలీ గురించి చెబుతూ.. ఎమోషన్ కి గురయ్యారు. మోనాల్ గుజ్జర్, మెహబూబ్ ఫ్యామిలీ గురించి స్పందిస్తూ భాగోద్వేగాంకి గురయ్యారు. మోనాల్ స్పందించే టైమ్ లో గంగవ్వ కూడా కన్నీరు పెట్టుకొంది.