ఏపీ కరోనా రిపోర్ట్ : 10,601 కేసులు, 73 మరణాలు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,601 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 73 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,17,094కి చేరింది. మరణాల సంఖ్య 4,560కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 96,769 యాక్టివ్‌ కేసులున్నట్లు తెలిపింది.

కొత్తగా మృతి చెందినవారిలో గుంటూరు జిల్లాలో 10 మంది, అనంతపురం 8, చిత్తూరు 8, కడప 7, ప్రకాశం 7, నెల్లూరు 6, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 5, కృష్ణా 5, పశ్చిమగోదావరి 5, శ్రీకాకుళం 3, కర్నూలు 2, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు.