జోహన్స్ బర్గ్ టెస్ట్ : భారత్ 187ఆలౌట్

జోహన్స్ బర్గ్ టెస్టులో టీమిండియా 187 పరుగులకే ఆలౌటయ్యింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (54), పుజారా (50) మిన‌హా మిగిలిన బ్యాట్స్ మెన్ వ‌చ్చిన వారు రాణించలేదు. టీమిండియా బ్యాట్స్ మెన్ల‌లో 7గురు సింగిల్ డిజిట్ కే ప‌రిమిత‌మ‌య్యారు. చివ‌ర్లో ఒక్క భువ‌నేశ్వ‌ర్ కుమార్ మాత్ర‌మే రెండంకెల స్కోర్ తో ఫర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో ర‌బ‌డా 3, మోర్కెల్, ఫిలాండ‌ర్ , ఫెలుక్‌వాయో చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఎనిమిది బంతులు ఎదుర్కొన్న సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ మార్‌క్రమ్‌ రెండు పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద భువనేశ్వర్‌ బౌలింగ్‌లో పార్ధీవ్‌పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆఖరి టెస్టు మొదటి రోజులో భారత్ మురిసేపోయే మూమెంట్ గా ఇదొక్కిటి మాత్రమే.