శ్రావణి ఆత్మహత్య కేసు.. తెరపైకి ఆర్ఎక్స్100 నిర్మాత పేరు !

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు సినిమా సీరియల్ ని తలపిస్తోంది. టిక్ టాక్ తో పరిచయమైన దేవరాజ్ రెడ్డి వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకొందని.. శ్రావణి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆయనపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే దేవరాజ్ మాత్రం సాయి అనే వ్యక్తి వలనే శ్రావణి ఆత్మహత్య చేసుకొంది. అంతేకాదు.. ఆర్ఎక్స్100 నిర్మాత అశోక్ రెడ్డి, శ్రావణి కుటుంబ సభ్యులే శ్రావణి ఆత్మహత్యకు కారణం. తన దగ్గర ఆధారాలున్నాయని మీడియాకు చెప్పారు.

దేవరాజు ఆరోపణలు చేసిన సాయి అనే వ్యక్తి కూడా మీడియా ముందుకొచ్చారు. తాను శ్రావణి ఫ్యామిలీ సన్నిహితుడిని. దేవరాజు ఆరోపించినట్టుగా శ్రావణితో తనకి ఎలాంటి సంబంధాల్లేవ్. తాను ఎక్కడికి పారిపోలేదు. శ్రావణి కుటుంబ సభ్యులతోనే ఉన్నాను అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో శ్రావణి, సాయిలలో దోషి ఎవరు ? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. మధ్యలో ఆర్ ఎక్స్ 100 నిర్మాత పేరు ఎందుకు వచ్చింది ? ఆయనతో శ్రావణి సన్నిహితంగా ఉందని దేవరాజు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రావణి ఆత్మహత్య కేసులో ఆయన పాత్ర ఎలాంటిది ? అన్నది తేలాల్సి ఉంది.