దీక్షకు దిగిన ఆర్ఆర్ఆర్

వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణ రాజు (ఆర్ఆర్ఆర్) ఢిల్లీ దీక్షకు దిగారు. అంతర్వేది ఆలయ రథం దగ్ధమైన సంగతి తెలిసిందే. ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు శుక్రవారం దిల్లీలో దీక్ష చేపట్టారు. ఆయనకు తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌, అమరావతి ఐకాస కన్వీనర్‌ జీవీఆర్‌ శాస్త్రి మద్దతు తెలిపారు.

ఇక అంతర్వేది ఆలయ రథం దగ్ధంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సీబీఐ విచారణ కోరిన సంగతి తెలిసిందే. సీబీఐ దర్యాప్తులు అసలు వాస్తవాలు వెలుగులోనికి రానున్నాయి. దీని వెనక తెదేపా అధినేత, ఆయన తనయుడు లోకేశ్ పాత్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది.