క్లైమాక్స్’కు శ్రావణి ఆత్మహత్య కేసు దర్యాప్తు


టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు దర్యాప్తు క్లైమాక్స్ కు చేరింది. ఈ కేసులో దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డి, ఆర్ ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డిలపై ఆరోపణలొచ్చిన సంగతి తెలిసిందే. శ్రావణి ముందుగా సాయితో ఆ తర్వాత దేవరాజ్ తో ప్రేమలో పడినట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.

శ్రావణితో నిర్మాత అశోక్ రెడ్దికి సంబంధం ఏంటీ ? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసులో దేవరాజ్, సాయిలని పోలీసులు విడివిడిగా విచారణ చేశారు. అయితే వీరిద్దరిని ఒకేసారి విచారించేందుకు పోలీసులు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సాయి, దేవరాజు, అశోక్ రెడ్డిలని శ్రావణి నడిపిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో టేపులు బయటికొచ్చాయ్. ఫైనల్ ఈ కేసులు దోషులు ఎవరు తేల్చే పనిలో పోలీసులున్నారు.