శ్రియ చెప్పిన ‘ఆర్ఆర్ఆర్’ ముచ్చట్లు

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. అలియా భట్‌ కథానాయిక. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే చిత్రంలో శ్రియ కూడా నటిస్తున్నారు.

లాక్‌డౌన్‌కు ముందు మార్చిలో ఆమె పాత్రకు సంబంధించి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి శ్రియ మీడియాతో మాట్లాడారు. ‘నాది ఇందులో అతిథి పాత్ర మాత్రమే. ‘ఛత్రపతి’ (2005) తర్వాత మరోసారి రాజమౌళితో కలిసి పనిచేయడం ఎంతో గొప్పగా అనిపించింది. ఆయనకు అద్భుతమైన విజన్‌ ఉంది. ఎంతో విభిన్నంగా ఈ సినిమాను చూపించడానికి ప్రయత్నిస్తున్నారు’. నేను అజయ్‌ దేవగణ్‌తో కనిపిస్తా. కానీ తారక్‌, చరణ్‌తో కలిసి పనిచేసే అవకాశం రాలేదు’ అని చెప్పుకొచ్చారు.