మీడియా ముందుకు శ్రావణి కేసు నిందితులు

టీవీ నటి శ్రావణి కొండపల్లి ఆత్మహత్య కేసుని పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ రెడ్డిలని సుదీర్ఘ విచారణ అనంతరం ఆదివారం అదుపులోనికి తీసుకున్నారు. సాయిని ఏ1 నిందితుడిగా, దేవరాజ్ ని ఏ2 నిందితుడిగా కేసులు నమోదు చేశారు.

ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎక్స్100 నిర్మాత అశోక్ రెడ్డిని ఎస్ ఆర్ నగర్ పోలీసులు ఈరోజు విచారించనున్నారు. విచారణ అనంతరం ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టు సమాచారమ్. ఇక ఈ సాయంత్రం నిందితులని మీడియా ముందు హాజరుపరచనున్నారు. కేసు వివరాలని మీడియాకు వివరించనున్నట్టు తెలుస్తోంది. దీంట్లో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరానున్నాయి.

మరోవైపు ఈ కేసులో చాలానే వీడియో, ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. సాయి, దేవరాజ్ ఇద్దరిని శ్రావణి ప్రేమించడం వలనే సమస్యలు వచ్చినట్టు తెలుస్తోంది. ముందుగా సాయిని ఆ తర్వాత దేవరాజుని శ్రావణి ప్రేమించింది. దేవరాజ్ పెళ్లి చేసుకొను అనడం వలనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని సమాచారమ్.