యాదాద్రి అద్భుత వీడియో షేర్ చేసిన కేటీఆర్

యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయ పునర్మాణ పనులు పూర్తి కావొస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. ఆలయ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సలహాలు, సూచనలు చేశారు. ఇప్పటికే 90శాతం పనులు పూర్తయ్యాయని తెలిసింది.

తాజాగా యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయానికి సంబంధించిన ఓ అద్భుత వీడియోని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘భవ్యమైన యాదాద్రి ( Yadadri ) శ్రీ లక్ష్మీ నరసింహా స్వామివారి ఆలయ నిర్మాణ పనులు వీక్షిద్దాం. గౌరవనీయులైన సీఎం కేసీఆర్ గారు ఆయన పనులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆలయం తెలంగాణ ఆధ్యాత్మిక రాజధానిగా అవతరించనుంది’ అని రాసుకొచ్చారు.