డ్రగ్స్ కేసులో రకుల్, సారా.. క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీబీ అధికారులు !

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టైన రియా చక్రవర్తి మరికొంత మంది పేర్లు బయటపెట్టింది. ఈ లిస్టులో సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ లు ఉన్నట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అలాంటిదేమీ లేదని వార్తలొచ్చాయ్. తాజాగా దీనిపై ఎన్‌సీబీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. విచారణలో రియా.. రకుల్, సారాలతో పాటుగా డిజైనర్‌ సిమోనె ఖంబట్టాల పేరు కూడా చెప్పినట్లు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా తెలిపారు.

మరోవైపు, ఎన్ సీబీ అధికారులు శనివారం ముంబయి, గోవాలలో పలు చోట్ల సోదాలు నిర్వహించి మరో ఆరుగురిని అరెస్టు చేశారు. బాంద్రాకు చెందిన కరంజీత్‌ సింగ్‌ ఆనంద్‌ అలియాస్‌ కేజేని అదుపులోకి తీసుకొని దక్షిణ ముంబయిలోకి ఎన్సీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అతడు డ్రగ్స్‌ సిండికేట్‌లో భాగస్వామిగా ఉన్నట్టు గుర్తించారు. తాజా అరెస్టులతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 16కు చేరింది.