బిస్కెట్లు తిని మరో చిన్నరి మృతి.. అసలేం జరిగింది ?


కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం కొమ్మలదిన్నెలో విషాదం చోటు చోసుకొంది. బిస్కెట్లు తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో పాప పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..  కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామానికి చెందిన హుసేన్‌బాషా, దిల్‌షాద్‌ దంపతుల ఇద్దరు పిల్లలు హుసేన్‌బాషా(6), హుసేన్‌బీ(4)..బాబాయి కుమార్తె జమాల్‌బీ(8)తో కలిసి ఆదివారం గ్రామంలోని దుకాణంలో బిస్కెట్లు కొనుగోలు చేశారు.

ఇంటి వద్దకు వచ్చి వాటిని టీతో కలిపి తిన్న తర్వాత ఒక్కసారిగా వాంతులు చేసుకొని కుప్పకూలారు. ఆళ్లగడ్డలోని ఆసుప్రతికి తరలించగా అప్పటికే హుసేన్‌బాషా ప్రాణాలు విడిచాడు. హుసేన్‌బీ, జమాల్‌బీ పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హుసేన్‌బీ సోమవారం ఉదయం కన్నుమూశారు. ప్రాథమిక విచారణ ఆధారంగా ఆహారం విషతుల్యం కావడంతోనే పిల్లలు మృతి చెందినట్లు నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు తహసీల్దారు తెలిపారు.