బాబోయ్.. దేశంలో ఒక్కరోజే లక్ష కేసులు !

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య దాదాపు లక్షకు చేరువగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 97,894 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 51 లక్షల మార్క్ ని దాటేశాయి.

గత 24 గంటల్లో వైరస్ వల్ల దేశంలో మరణించిన వారి సంఖ్య 1132గా ఉన్నది. దేశవ్యాప్తంగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 51,18,254గా నమోదు అయ్యింది. దేశంలో మొత్తం 10,09,976 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సుమారు 40,25,080 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 83,198కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.