చికిత్సకు డబ్బుల్లేక.. దర్శకుడు బాబు శివన్ మృతి !

కోలీవుడ్ లో విషాదం నెలకొంది. దర్శకుడు బాబు శివన్ కన్నుమూశారు. అయితే ఆయన చికిత్స చేసుకోవడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితుల్లో మృతి చెందాడన్న విషయం కలచివేస్తోంది. ఇటీవల బాబు శివన్ ఇద్దరు కుమార్తెలు నీట్ పరీక్ష కోసం వెళ్లారు. వారితో పాటు ఆయన భార్య కూడా వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాబు శివన్ భార్య పిల్లలు వచ్చే సమయంకు కుప్పకూలి ఉన్నాడు.

వెంటనే అతడిని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనకు పరీక్షలు నిర్వహించిగా లంగ్స్, కాలేయం పూర్తిగా చెడిపోయింది. చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో.. అంత డబ్బులేదని కుటుంబ సభ్యులు రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డయాలసీస్ చేయడంతో పాటు చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో అతడి ఆరోగ్యం మరింతగా క్షీణించి తుదిశ్వాస విడిచారు. డబ్బులు లేని కారణంగానే చికిత్స ఆలస్యం అయింది. లేదంటే.. మా తండ్రి బతికేవారనే ఇద్దరు కుమార్తెలు రోధించడం మనసులని కలిచివేస్తోంది. సినీ ప్రముఖులెవ్వరు బాబు శివన్ కుటుంబానికి సాయం చేయలేదని తెలిసింది.