డబుల్ బెడ్ రూమ్ సవాల్.. రెండో రోజూ కూడా !

అసెంబ్లీలో సవాల్ విసిరినట్టు మంత్రి తలసాని తనకి లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని చూపించాల్సిందేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టీ విక్రమార్క పట్టుబడుతున్నారు. గురువారం స్వయంగా మంత్రి తలసాని భట్టీ ఇంటికి వెళ్లి.. ఆయన్ని తీసుకెళ్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని చూపించిన సంగతి తెలిసిందే. తనకు మూడు వేలకు పైగా మాత్రమే ఇళ్లని చూపించారు. మిగితా ఇళ్లని కూడా చూపించాల్సిందేనని పట్టుబడుతున్నారు.

ఇవాళ మంత్రి తలసాని బిజీ షెడ్యూల్ వలన రాలేకపోతున్నారు. మేయర్ బొంతు వచ్చి.. భట్టీకి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని చూపిస్తామన్న భట్టీ అంగీకరించలేదని తెలుస్తోంది. తనకి స్వయంగా మంత్రి తలసానినే లక్ష ఇళ్లని చూపించాలని భట్టీ కోరుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాన్నాళ్లుగా మాయ చేస్తోంది. ప్రజల్లో భ్రమని కల్పిస్తోందని భట్టీ అన్నారు. దీనిపై పజలకి క్లారిటీ ఇవ్వాలంటే.. తనకి హైదరాబాద్ నగరంలో లక్ష ఇళ్లని చూపించాల్సిందేనని కోరుతున్నారు.