ముంబై Vs చెన్నై : ముంబై 124/5 (14 ఓవర్లు)

ఐపీఎల్-13 సీజన్ లో మొదటి మ్యాచ్ ముంబై-చెన్నై జట్ల మధ్య మొదలైంది. తొలి బ్యాటింగ్ చేస్తున్న ముంబై దాటిగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్-డికాక్ తొలి 4 ఓవర్లలో 45 పరుగులు చేశారు. మ్యాచ్‌ ఒక్కసారిగా ఛేంజ్‌ అయిపోయింది.

సీఎస్‌కే స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా వేసిన ఐదో ఓవర్‌ నాల్గో బంతికి రోహిత్‌(12) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, క్వింటాన్‌ డీకాక్‌(33) ఆ తర్వాత ఓవర్‌లో పెవిలియన్‌ చేరాడు. ఆ కొద్దిసేపటికే సూర్యకుమార్ ని జడేజా అవుట్ చేశారు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 5 వికెట్ల నష్టానికి 124 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. తివారీ 42, హార్దిక్ పాండ్యా 14 ఒకే ఓవర్ లో పెలివియన్ చేరారు.