ఆ దర్శకుడు బట్టలు విప్పమన్నాడు.. పిలిస్తే ఆ హీరోయిన్స్ వస్తారన్నాడు.. పాయల్ సంచలన ఆరోపణలు !

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ పై హీరోయిన్పాయల్‌ ఘోష్ సంచలన ఆరోపణలు చేసింది. తనని అనురాగ్ ఇంటికి పిలిచి బట్టలు విప్పమన్నాడు. అంతేకాదు.. తాను పిలిస్తే రిచా చద్దా,  హ్యుమా ఖురేషిలాంటి హీరోయిన్స్ వస్తారు. ఇక్కడ ఇదంతా సాధారణమేనని అన్నాడు. తనని బలవంతం చేశాడని పాయల్ ఆరోపనలు చేసింది. ఆ సమయంలో అనురాగ్ రణబీర్‌ కపూర్‌తో ‘బాంబే వెల్వెట్‌’ సినిమా చేస్తున్నారు. రణబీర్ తో సినిమా ఛాన్స్ కోసం తాను ఏ అమ్మాయిని పిలిచినా వస్తుందని అన్నాడని పాయల్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

మరోవైపు పాయల్‌ ఘోష్‌ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలని దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఖండించారు. ఆ ఆరోపణలన్నీ నిరాధారమైనవి. ఒక మహిళ అయిన మీరు.. నాతో కొంతమంది నటీమణులకు సంబంధాలున్నాయంటూ ఆరోపించడం తప్పుగా అనిపించలేదా? ప్రతిదానికీ కొన్ని హద్దులుంటాయి. దర్శకుడిగా ఎంతోమంది హీరోయిన్స్‌తో మాట్లాడుతుంటాను. కానీ, ఎప్పుడూ వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించలేదని వివరణ ఇచ్చారు.