తెలంగాణలో డబుల్ రికవరీ 

తెలంగాణలో క్రమక్రమంగా కరోనా కంట్రోల్ లోకి వస్తున్నట్టు కనిపిస్తోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,302 కొత్త కేసులు నమోదు కాగా.. 2,330 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్  అయ్యారు. దీంతో కొత్త కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య దాదాపు డబుల్ గా ఉంది. 

ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,72,608కి చేరింది. నిన్న ఒక్కరోజే 9 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1042గా ఉంది. ఇక మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,41,930గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,636 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24గంటల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిథిలో 266 కేసులు నమోదుకాగా, కరీంనగర్‌లో 102, రంగారెడ్డిలో 98, సిద్దిపేటలో 92,నల్గొండలో 70,మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.