దోస్త్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి

దోస్త్‌-2020లో భాగంగా మొదటి దశ సీట్లను కేటాయించారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఓ ప్రకటన చేసింది. మొత్తం  1,71,275 మంది విద్యార్థులు దోస్త్‌లో నమోదు చేసుకున్నారన్నారు.  1,41,340 మంది విద్యార్థులకు మొదటి దశలో డిగ్రీ సీట్లు కేటాయించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు.

సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 26 వరకు దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తర్వాత రెండో విడతలో వెబ్‌ఆప్షన్లు ఇవ్వొచ్చన్నారు. నేటి నుంచి రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుందని లింబాద్రి స్పష్టం చేశారు.