‘మహానటి’ ఆలస్యానికి అసలు కారణమిదే !

‘మహానటి’ సావిత్రి బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్వీన్ దర్శకుడు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, ఆమె భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, జమునా పాత్రలో సమంత, ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు. ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, షాలినీ పాండే.. తదితరులు ఇతర ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాని ముందుగా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. ఇప్పుడీ రిలీజ్ డేటు మారేలా కనబడుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకి ఎక్కువ సమయం పట్టేలా ఉందట. ఈ నేపథ్యంలో సినిమాని వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాహుశా.. ఏప్రిల్ ‘మహానటి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని వైజ‌యంతి మూవీస్ నిర్మిస్తోంది.