తెలంగాణలో కొత్త కేసుల స్థాయిలో రికవరీ కూడా !

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ 2వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో రికవరీ రేటు పెరుగుతూ వస్తోంది. ఇటీవల కాలంలో రికవరీ అవుతున్న వారి సంఖ్య కొత్త కేసులకి దాదాపు సమానంగా ఉంటుంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2,166 కొత్త కేసులు నమోదు కాగా..   2,143 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,44,073 కి చేరింది.

రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,74,774కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,052కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,649 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 22,620 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.