నవీన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

సరూర్ నగర్ చెరువు పడి మృతి చెందిన నవీన్ కుమార్ కుటుంబాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఈ ఉదయం అల్మాస్గూడలోని నవీన్ ఇంటికి మంత్రి వెళ్లారు. కుటుంబ సభ్యులని ఓదర్చారు. ప్రభుత్వం అండగా ఉంటుంది.. నవీన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు నేరెడ్ మెట్ ఘటనపై మాత్రం ప్రభుత్వం స్పందించడం లేదు. ఇటీవల నేరెడ్ మెట్ లో 12యేళ్ల సుమేధ సైకిల్ తొక్కుతూ ఓపెన్ నాలలో కొట్టుకుపోయి బండ చెరువులో విగతజీవిగా తేలింది. ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. పైగా ఈ ఘటనపై అనుమానాలున్నాయని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు.

ఈ నేపథ్యంలో సమేధ తల్లిదండ్రులు సోమవారం పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. తమ కూతురు చనిపోవడానికి జీహెచ్ ఎంసీ అధికారుల నిర్లక్ష్యమని సుమేధ తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ ఎంసీ అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.