ధోని కిందికి వెళ్లడానికి కారణమిదే !

ఐపీఎల్13లో ఇరగదీస్తాడనుకున్న మహేంద్ర సింగ్ ధోని తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. తొలి మ్యాచ్ ముంబైతో రెండు బంతులాడి ఖాతా కూడా తెరవలేదు. ఇక నిన్నటి రాజస్థాన్ మ్యాచ్ లోనూ ధోని లోయర్ ఆర్డర్ లో వచ్చారు. ఆయన ఏమాత్రం ఫైర్ కనిపించలేదు. కేవలం సింగిల్స్‌కే పరిమితం అయ్యాడు. కానీ ఆఖరి మూడు బంతులని సిక్సర్స్ గా మలిచి ఆకట్టుకున్నాడు.

రాజస్థాన్‌ చేతిలో ఓటమి తర్వాత ధోని.. తాను లోయర్ ఆర్డర్ లో రావడానికి గల అసలు కారణం చెప్పాడు. సాధనకు అవసరమైన సమయం దొరకలేదు.  అందులోనూ ఏడాది కాలం బ్యాటు పట్టుకోకపోవడంతో దిగువ ఆర్డర్‌లో వస్తున్నానని నిజం చెప్పేశాడు. చెన్నై శిబిరంలో ఇద్దరు ఆటగాళ్లు సహా 13 మందికి కొవిడ్‌-19 సోకడంతో ఎక్కువ రోజులు ఏకాంతంలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇక స్టీవ్‌ స్మిత్‌, సంజు శాంసన్‌ అద్భుతంగా ఆడారు. రాజస్థాన్‌ బౌలర్లనూ మెచ్చుకోవాల్సిందేనని ధోని అన్నారు.