ఏపీలో కరోనా కొత్త కేసుల తగ్గుదల.. రికవరీ పెరుగుదల !

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసులు భారీగానే నమోదవుతున్నాయ్. అయితే అదే సమయంలో రికవరీ అవుతున్న వారి సంఖ్య భారీ పెరుగుతోంది. అది కొత్త కేసుల సంఖ్య అధికంగా ఉండటం సంతోషించాల్సిన విషయం. గడిచిన 24 గంటల్లో ఏపీలో 7,228 కొత్త కేసులు నమోదయ్యాయి. 8,291 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో  ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య  5,70,667కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,46,530కు చేరింది. ప్రస్తుతం 70,357 యాక్టివ్‌ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే 45 మంది కరోనా మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,46,530కు చేరింది. ప్రస్తుతం  70,357 యాక్టివ్‌ కేసులున్నాయి. రికవరీ అవుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో.. కొత్త కేసుల సంఖ్య అదుపులోనికి వస్తే.. కరోనా నుంచి ఏపీ కోలుకున్నట్టే.