కరోనాతో టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత

కరోనాతో పలువురు, సినీ రాజీకీయ ప్రముఖులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు వేణు గోపాల్ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిపడిన వేణు గోపాల్.. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 22 రోజులుగా చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవారు. తెలుగులో దాదాపు 30 సినిమాల్లో ఆయన నటించారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు, మర్యాద రామన్న సినిమాల్లో వేణు గోపాల్ రావుకి మంచి పాత్రలు దక్కాయి. ‘మర్యాద రామన్న’లో బహ్మాజీ తండ్రి పాత్రలో కనిపించి నవ్వులు పూయించారు. అందుకే ఆయన్ని మర్యాద రామన్న నటుడిగా ప్రేక్షకులకి గుర్తిండిపోయారు.