విజయం ముగింట ముంబై

ఐపీఎల్ 13లో ముంబై తొలి విజయాన్ని నమోదు చేయనుంది. కోల్ కతా నైట్ రైడర్స్ జరుగుతున్న మ్యాచ్ లో ముంబై విజయం ముంగిట ఉంది. మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. సారథి రోహిత్‌ శర్మ (80, 54 బంతుల్లో; 3×4, 6×6) అర్ధశతకంతో చెలరేగాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (47, 28 బంతుల్లో; 6×4, 1×6)తో ఆకట్టుకున్నాడు.

197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా 17.3 ఓవర్లలో 134/7తో ఆటని కొనసాగిస్తోంది.  ప్రస్తుతం క్రీజులో కుమిన్స్ 21 (బంతులు), మావి 4 పరుగుతొ ఉన్నారు. కమిన్స్ జోరుమీదున్న.. 197 పరుగుల లక్ష్యం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. దీంతో ముంబై ఇండియన్స్ ఈ టోర్నీలో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకొనే కనిపిస్తోంది.