ఫ్లాష్.. ఫ్లాష్ : బాలు ఆరోగ్యం మళ్లీ సీరియస్ 

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన కోలుకుంటున్నారు. ఆహారం తీసుకుంటున్నారు. వ్యాయామం చేస్తున్నారు. దీంతో అతి త్వరలోనే బాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని అందరు భావించారు. ఇంతలో పిడుగులాంటి వార్త. బాలు అనారోగ్యం తిరగబడినట్టు తెలుస్తోంది. మళ్లీ ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ సమస్య వచ్చినట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో బాలు హెల్త్ బులిటెని విడుదల చేయనున్నారు.

ఆగస్టు 5న బాలు కరోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. దాదాపు మూడు వారాలపాటు ఆయన డీప్ కోమాలో ఉన్నారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ఓ గండం గడిచింది. ఇంకాస్త ఆరోగ్యం కుదుటపడితే.. మునుపటి బాలు అవుతారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని అనుకున్న టైమ్ షాకింగ్ న్యూస్ వచ్చింది. దాదాపు 40రోజులుగా బాలు ఆసుపత్రిలో ఉంటున్న సంగతి తెలిసిందే.