హేమంత్ పరువు హత్యకేసు.. షాకింగ్ నిజాలు !

తెలంగాణలో ప్రణయ్ పరువు హత్య రిపీట్ అయింది. హైదరాబాద్ చందానగర్ లో హేమంత్ అనే యువకుడు పరువు హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ చందానగర్ కు చెందిన హేమంత్ అదే ప్రాంతానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఇష్టం లేని అమ్మాయి అవంతి తండ్రి లక్ష్మారెడ్డి కీరాయి గుండాలని పెట్టి హేమంత్ అతి దారుణంగా హత్య చేయించాడు. నిన్న సాయంత్రం 4:30 నిమిషాలకు హేమంత్ ని తీసుకెళ్లి సంగారెడ్డిలో దారుణంగా హత్య చేశారు.

తాజాగా ఈ కేసుకు సంబంధించిన విషయాలు మీడియాకు వివరించారు చందానగర్ పోలీసులు. హేమంత్ హత్య కేసులో అమ్మాయి తండ్రి లక్ష్మారెడ్డి, బంధువులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. నిన్న సాయంత్రం 4:30 నిమిషాలకు హేమంత్ ని తీసుకెళ్లారు. హేమంత్ తండ్రి 100కు డయల్ చేసి చెప్పారు. అప్పటికే హేమంత్ ని చంపేశాని తెలిపారు. సాయంత్రం 6:30 నిమిషాలకు అవంతి మాకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. 

అంతకుముందు అవంతి మీడియాతో మాట్లాడారు. హేమంత్ కి పెద్దగా ఆస్తులేమీ లేవు. కానీ మేం సంతోషంగా ఉండేవాళ్లమని తెలిపింది. ఎంత మంది ఉనా మాకు ఎవరు సాయం చేయలేదు. మాకు ప్రాణహాని ఉందని చందానగర్ పోలీసులకు తెలిపాం. కానీ పట్టించుకోలేదు. అమృత తల్లిదండ్రుల గతి ఏమైంది ? మా మేనమామ యుగంధర్ రెడ్డినే నా భర్తని తీసుకెళ్లి చంపేశారని అవంతి తెలిపింది. ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టొద్దు. అందరికీ శిక్ష పడాల్సిందేనని కోరింది.