హేమంత్’ని హత్య చేసింది.. కిరాయి గుండాలు కాదు.. అంతా బంధువులే !

హైదరాబాద్ చందానగర్ హేమంత్ పరువు హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హేమంత్ హత్య చేసింది కిరాయి గుండాలు కాదు. అంతా బంధువులేనని పోలీసులు తెలిపారు. హేమంత్ భార్య అవంతి మేనమామ యుగేంధర్ రెడ్డి, ఇతర బంధువులు కలిసి హేమంత్ ని కిడ్నాప్ చేశారు. సంగారెడ్డికి తీసుకెళ్లి అత్యంత దారుణంగా హత్య చేశారని తెలిపారు. చేతులు, కాళ్లు కట్టేసి హత్య చేశారు.

మీడియాతో మాట్లాడిన హేమంత్ భార్య అవంతి.. తల్లిదండ్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత తండ్రి మారుతిరావు పరిస్థితి ఏమైంది ? అని ప్రశ్నించింది. ఇంకా కులం గజ్జి ఎందుకు ? హేమంత్ ని చంపి ఏం సాధించాడు ? ఆయన ప్రశాంతంగా ఉంటారా ?? నేను సుఖంగా ఉంటానా ?? అని ప్రశ్నల వర్షం కురిపించింది. మీడియాతో మాట్లాడిన హేమంత్ తండ్రి పరిస్థితి ఇంత వరకు వస్తుందని అనుకోలేదన్నారు. అవంతి పేరు మీదున్న ఆస్తులన్నీ వారికి రాసిచ్చాం. అయినా.. నా కొడుకుని వదల్లేదని వాపోయారు.