రకుల్’ని అరెస్ట్ చేస్తారా ?

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సీబీ అధికారుల ముందు హాజరైంది. ప్రస్తుతం ఎన్ సీబీ అధికారులు రకుల్ ని విచారిస్తున్నారు. రియాతో డ్రగ్స్ చాట్ గురించి ఎన్ సీబీ అధికారులు అడగుతున్నట్టు సమాచారమ్. ఈ సాయంత్రం వరకు రకుల్ ని విచారించే అవకాశాలున్నాయి. అయితే రకుల్ ని విచారించి వదిలేస్తారా ? అరెస్ట్ చేస్తారా ?? అన్నది ఆసక్తిగా మారింది. 

ఈ కేసులో రియాని మూడు రోజుల విచారణ తర్వాత అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఎన్ సీబీ అధికారులు చాలా మందిని అరెస్ట్ చేసారు. కానీ అరెస్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో రకుల్ ని అరెస్ట్ చేసే ఛాన్స్ లేదని చెబుతున్నారు. ఈ కేసులో నిజంగానే రకుల్ ప్రమేయం ఉందని భావిస్తే.. ఆమెని మరోసారి విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది. అప్పుడు అరెస్ట్ చేసినా చేయొచ్చని సమాచారమ్.

ఇక రేపు దీపికా పదుకొనె, ఆమె మేనేజర్ కరిష్మా ఎన్ సీబీ అధికారుల ముందు విచారణకు హాజరుకానుంది. డ్రగ్స్ చాట్ లో దీపికా పాత్ర ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె డ్రగ్స్ కోసం పలుమార్లు చాట్ చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో దీపికా పాత్ర కీలకంగా మారనుంది. దీపిక తనకోసం డ్రగ్స్ ఆర్డర్ చేసిందా ? లేక వేరే ఎవరికోసమైనా తెప్పించిందా ?? అన్నది విచారణలో తేలనుంది.