డ్రగ్ కేసు : నేరం ఒప్పేసుకున్న రకుల్ 

బాలీవుడ్ డ్ర కేసులో ఎన్సీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో నోటీసులు జారీ చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనె, అమె మేనేజర్ కరిష్మా ప్రకాష్, శ్రదా కపూర్, సారా అలీఖాన్ లని విచారిస్తున్నారు. నిన్న రకుల్ ని ఎన్ సీబీ అధికారులు విచారించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆమె విచారించారు. విచారణలో రకుల్ అన్నీ నిజాలే చెప్పినట్టు తెలుస్తోంది. తనకి డ్రగ్స్ తీసుకొనే అలవాటు మాత్రం లేదు. కాకపోతే రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకొచ్చి తన ఇంట్లో దాచిపెట్టేదని చెప్పింది. 

డ్రగ్స్ తీసుకోవడం మాత్రమే కాదు. డ్రగ్స్ ఇంట్లో దాచిపెట్టడం కూడా నేరమే. ఈ నేపథ్యంలో రకుల్ నేరం ఒప్పేసుకున్నట్టు అర్థమవుతోంది. దీంతో త్వరలో ఆమెని ఎన్ సీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇక ఈ కేసులో ఈరోజు దీపికా పదుకొనె ఎన్ సీబీ విచారణకు హాజరయ్యారు. శ్రద్దా, సారాలని కూడా ఈరోజే విచారిస్తున్నారు. వీరిద్దరి విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారమ్ రానుంది.