డీకే అరుణ’కి పెద్ద పదవి.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియామకం !

బీజేపీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ కార్యవర్గంలో తెలంగాణ బీజేపీ మహిళానేత డీకె అరుణకి పెద్ద పదవి వరించింది. ఆమెని జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. దగ్గుబాటి పురందేశ్వరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ ను ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమించారు. ఇక సీనియర్ నేతలు రాంమాధవ్, మురళీధర్ రావులకు కార్యవర్గంలో చోటు దక్కలేదు. ఏపీకి చెందిన సత్యకుమార్ కు జాతీయ కార్యదర్శి పదవి అప్పగించారు.
 
తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని భాజాపా భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా కొత్త టీమ్ ని ఏర్పాటు చేసుకుంటోంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలకి కొత్త అధ్యక్షులని నియమించింది. దీంతో ఏపీ, తెలంగాణ భాజాపాలో నూతనోత్సాహం కనిపిస్తుంది. తాజాగా జాతీయ కార్యవర్గంలోనూ తెలుగు నేతలకి ప్రాధాన్యత కల్పించారు. ముఖ్యంగా ఒక్కో తెలుగు రాష్ట్రం నుంచి ఒక్కో మహిళా నేతకు కాస్త పెద్దవిని ఇచ్చారు.