బిగ్ బాస్ : లాస్య ఆన్ ఫైర్


బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా మూడు వారాలని పూర్తి చేసుకుంది. అయితే హోస్ట్ నాగార్జున ఎంట్రీతో శని, ఆదివారాలు సాగిన బిగ్ బాస్ షో సోమవారం మళ్లీ సీరియస్ మూడులో వెళ్లిపోయింది. సోమవారం అసలే ఎలిమినేషన్ ప్రాసెస్.. ఆ హీటు కనిపించడం సహజమే. కానీ ఈ సోమవారం ఆ డోసు కాస్త ఎక్కువగానే ఉన్నట్టుంది. కొద్దిసేపటి క్రితమే స్టార్ మా లెటెస్ట్ ప్రోమోని విడుదల చేసింది. ఇందులో ఎప్పుడూ కూల్ గా కనిపించే లాస్య ఓ రేంజ్ లో ఫైర్ అయింది. నోయల్ పై విరుచుపడింది. నువ్వెంత అన్నట్టుగా ఫైర్ అయింది. మరీ.. ఆ ఆగ్రహానికి కారణం ఏంటీ ? అన్నది ఈరోజు షోలో తెలియనుంది.

ఇక మూడువారం బిగ్ బాస్ ఇంటి నుంచి దేవి నాగవల్లి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె ఎలిమినేషన్ బిగ్ బాస్ ఇంటి సభ్యులు, ప్రేక్షకులకి షాకినిచ్చింది. ఎందుకంటే ? దేవి నాగవల్లి స్ట్రాంగ్  కంటెస్టెంట్.. ఆమె కన్నా కుమార్ సాయి బలహీనంగా కనిపించారు. సో.. మూడో వారం కుమార్ సాయి ఎలిమినేట్ అవుతారని భావించారు. కానీ బిగ్ సప్రైజ్ ఇస్తూ.. దేవి ఎలిమినేట్ అయ్యారు. అయితే మరీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తిరిగి బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.