ఢిల్లీలో మరో నిర్భయ ఘటన

దేశంలో నిర్భయ, దిశ ఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన మహిళలపై అత్యాచార ఘటనలు ఆగడం లేదు. తాజాగా  ఉత్తరప్రదేశ్‌లోని హత్రస్‌లో దారణం జరిగింది. పంట పొలాల చాటున 20యేళ్ల యువతిపై కామాంధులు విరుచుకుపడ్డారు. అరవకుండా నాలుక కోసి అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఈ నెల 14న 20యేళ్ల యువతి అమ్మ, సోదరుడితో కలిసి పొలానికి వెళ్లింది. గడ్డి కోసుకుని సోదరుడు ముందే ఇంటికి వచ్చాడు. తల్లి, కూతురు పొలంలోనే ఉండిపోయారు. తల్లికి కొద్ది దూరంలో ఉన్న ఆ యువతిని నలుగురు దుండగులు సమీపంలో ఉన్న సజ్జ చేనులోకి లాక్కెళ్లారు. ఆమె అరవకుండా నాలుక కోసేశారు. ఆ తర్వాత నలుగురు కలిసి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్దిసేపటి తర్వాత కూతురు కోసం తల్లి వెతకగా.. అప్పటికే కోమాలోకి వెళ్లిపోయింది. మృత్యువుతో పోరాడిన యువతి కన్నుమూసింది. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకి ఫిర్యాదు చేసినా.. కేసు బుక్ చేయలేదని బాధితులు ఆరోపించారు.